సచివాలయం ఉద్యోగులలో ఆందోళన.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయంలో ను రెండు రకాలుగా పెట్టింది.
గ్రామములో ఉన్న ప్రజల కోసం 1.గ్రామ సచివాలయం
పట్టణంలో ఉన్న వార్డులో ఉన్న ప్రజల కోసం 2.వార్డ్ సచివాలయం లను ఏర్పాటు చేశారు.
1.గ్రామ సచివాలయం.
- ఇది పంచాయితీ రాజ్ శాఖ క్రింది కు వస్తుంది.
- వీటికి మండలం లో ఉన్న MPDO అధికారి క్రింద ఉంటాయి.
- గ్రామ సచివాలయం సంబంధించిన గవర్నమెంట్ లో పంచాయితీ రాజ్ శాఖ G.O లను చేస్తుంది.
2.వార్డ్ సచివాలయం.
- ఇది పట్టణ అభిరుద్ది శాఖ క్రింది కు వస్తుంది.
- వీటికి ఒక్కక్క లో ఉన్న మునిసిపల్ కమిషనర్ అధికారి క్రింద ఉంటాయి.
- వార్డ్ సచివాలయం సంబంధించిన గవర్నమెంట్ లో పట్టణ అభిరుద్ది శాఖ G.O లను చేస్తుంది.
నియమాలు మరియు నిబంధనలు ఒక్కొక్క దానికి ఒక్కో విధానంగా వుంటాయి.
ఇప్పుడు సచివాలయం ఉద్యోగాలలో ఆందోళన ఎందుకంటే ?
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC ద్వారా సచివాలయంలో లో ఉద్యోగులను భర్తీ చేసారు.
అక్కడ అందరికి 15000 రూపాయలు నెలకు ఇలా 2 ఇయర్స్ వరుకు ఇస్తాము ఆ తరువాత మీకు అంటే మీ ప్రోబిషనరీ పీరియడ్ అయ్యిపోయ్యాక సచివాలయం ఉద్యోగులు అందరికి pay బేసిక్ మరియు గవర్నమెంట్ ఎంప్లాయ్ గా గుర్తిస్తాము అని చెప్పడం జరిగింది.
గత 3 నెలలు నుంచి సచివలయలలో మొదలు అయ్యాయి.కానీ సచివాలయం ఉద్యగుల ఎంపిక మాత్రము పూర్తి కాలేదు.
స్లైడింగ్ మరియు ఒక జిల్లాలో ఎంపిక అయ్యిన వారు మరొక జిల్లాలో ఎంపిక కావడం వల్లనే అలాగే కొన్ని పోస్టులలో క్వాలిఫై అభ్యర్థుల లేకపోడం కూడా ఇందుకు కారణం.
80 శాతం పూర్తి అయ్యాక అన్ని సచివాలయంలో ఉన్న ఉద్యోగుల వివరాలు ను నమోదు చెయ్యాలి అని చెప్పడం జరిగింది.
దేనితో ఆయా సచివాలయంలో సంధించిన DDO లు AP ఆర్థిక శాఖ పోర్టల్ ను CFMS మరియు HRMS లు నమోదు చేశారు.
HRMS ఐడి ను తెలుసుకోడం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇక్కడ గ్రామ సచివాలయంలో ఉద్యోగులకు 301 నుంచి వేతనాలు చెల్లిస్తాము అని చెప్పడం జరిగింది.
అలాగే వార్డ్ సచివాలయంలో ఉద్యోగులకు 010/100 నుంచి వేతనాలు చెల్లిస్తాము అని చెప్పడం జరిగింది.
కానీ ఇక్కడ 101 అంటె పెర్మనెంట్ ఉద్యోగులు క్రింద వేతనాలు చెల్లింపు చేయాలని అని అనుకుంటుంది.
010 పద్దు మీద సర్పంచులు కు అధికారం లేదు.రేపు సర్పంచు లు వస్తే 300 ,301 పద్దుల మీద సెలవులు ఇచ్చే అధికారం ఉంటుంది.
అలాగ్ 300/301 అంటే కాంట్రాక్టు ఉద్యోగులు క్రింద వేతనాలు చెల్లింపు చేయాలని అని అనుకుంటుంది.
treasury లో ఉన్న కోడ్ ఇవి.
సచివాలయం ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను 010/100 నుండి చెల్లించవచ్చును కదా మరి 301నుండి చెల్లించడం ఎందుకు ఫారం -47 అనేది జస్ట్ పే బిల్ ఫారం మాత్రమే వార్డ్ సచివాలయం ఎంప్లాయిస్ కి 010 నుండి జీతాలను చెల్లించుచున్నపుడు మాకి కూడా దాని నుండి చెల్లించవచ్చును కదా individual contract employees కింద చెల్లించడం ఎందుకు?
ఇప్పటికే విధులలో చేరిన కొంత మంది గ్రామసచివాలయం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇదే గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు తమని పెర్మనెంట్ ఉద్యోగుల గా గురించి లేదు అని అలాగే వార్డ్ లో ఉన్న వారిని పెర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించారు అని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం సచివాలయం వ్యవస్థ కోసం కూడా పాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు.
దేనికోసం ఒక G. O ను కూడా గవర్నమెంట్ pass చేసింది.
1.ఇప్పటికి ప్రభుత్వం సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరిని 2 ఇయర్స్ తరువాత పెర్మనెంట్ ఉద్యోగుల గా మారుస్తాము అని చెప్పడం జరిగింది.
గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలపై ZP CEO గారి క్లారిఫికేషన్
- గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులే.
- ఉద్యోగంలో జాయినింగ్ తేదీ నుండే వేతనాలు.
- స్లైడింగ్ లో రెండో పోస్ట్ లో జాయిన్ అయితే పాత పోస్ట్ జాయినింగ్ తేదీ నుండి జీతాలు.అయితే పూర్వ మండల ఎంపీడీఓ గారి దగ్గర నుండి Non drawn Certificate ను ప్రస్తుత ఎంపీడీఓ గారికి అందించాలి.
- ఏ హెడ్ నుండి జీతం చెల్లించినా, బిల్లులను FORM-47 లో సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి.అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించబడును.
- ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- NBKR ఇంజనీరింగ్ కాలేజ్,ట్రైనింగ్ లో CEO గారు పై విషయాల్ని క్లారిఫై చేశారు.
మొన్న జరిగిన అసెంబ్లీ లోకూడా సచివాలయం ఉద్యోగులను 2 సంవత్సరాలు తరువాత పెర్మనెంట్ ఉద్యోగులుగా చేస్తాము అన్ని చెప్పడం జరిగింది.
All The Best, Good Luck Guys !!From #APNirudyogiEducation
****************Join******************
#Telegram https://t.me/nirudygi
#Website https://nirudyogieducation.in